కావలసిన పదార్ధాలు :
సేమ్యా : వంద గ్రాములు
నూనె : మూడు టేబుల్ స్పూన్ లు
పల్లీలు : టేబుల్ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
పసుపు : చిటికెడు
ఉప్పు : తగినంత
నిమ్మరసం : టీ స్పూన్
ఆవాలు : పావుటీ స్పూన్
పచ్చిమిర్చి : మూడు
అల్లం : చిన్న ముక్క
కొత్తిమీర : కొద్దిగా
నెయ్యి : టేబుల్ స్పూన్
తయారుచేయు విధానం :
1) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నెయ్యి వేడిచెయ్యాలి. కాగాక సేమ్యా వేసి వేయించాలి.
2) స్టవ్ మీద నీళ్ళు మరిగించి వేయించిన సేమ్యా వేసి ఒకనిముషం వుంచి పసుపు కొద్దిగా నూనెవేసి ఉడికించి, నీళ్ళు వంచి పక్కనపెట్టాలి. ఇలా చేస్తే సేమ్యా పొడిపొడిగా ఉంటుంది.
3) స్టవ్ మీద కళాయిపెట్టి నూనె వేడిచేసి ఆవాలు, పల్లీలు, కరివేపాకు వేసి వేయించాలి. వేగాక అల్లంముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, ఉప్పు వేసి వేయించి ఉడికించిన సేమ్యా వేసి కలపాలి.
4) దించేముందు నిమ్మరసం, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపాలి.
సేమ్యా : వంద గ్రాములు
నూనె : మూడు టేబుల్ స్పూన్ లు
పల్లీలు : టేబుల్ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
పసుపు : చిటికెడు
ఉప్పు : తగినంత
నిమ్మరసం : టీ స్పూన్
ఆవాలు : పావుటీ స్పూన్
పచ్చిమిర్చి : మూడు
అల్లం : చిన్న ముక్క
కొత్తిమీర : కొద్దిగా
నెయ్యి : టేబుల్ స్పూన్
తయారుచేయు విధానం :
1) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నెయ్యి వేడిచెయ్యాలి. కాగాక సేమ్యా వేసి వేయించాలి.
2) స్టవ్ మీద నీళ్ళు మరిగించి వేయించిన సేమ్యా వేసి ఒకనిముషం వుంచి పసుపు కొద్దిగా నూనెవేసి ఉడికించి, నీళ్ళు వంచి పక్కనపెట్టాలి. ఇలా చేస్తే సేమ్యా పొడిపొడిగా ఉంటుంది.
3) స్టవ్ మీద కళాయిపెట్టి నూనె వేడిచేసి ఆవాలు, పల్లీలు, కరివేపాకు వేసి వేయించాలి. వేగాక అల్లంముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, ఉప్పు వేసి వేయించి ఉడికించిన సేమ్యా వేసి కలపాలి.
4) దించేముందు నిమ్మరసం, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపాలి.