కంద తోటకూర (Kanda Thotakura Fry in Telugu)

కావలసిన పదార్దాలు: 


కంద : పావుకిలో 
తోటకూర తరుగు : మూడు కప్పులు 
ఉప్పు: తగినంత  
పసుపు :  అర టీ స్పూన్ 
కారం : టీ స్పూన్ 
చింతపండు రసం : 2 టేబుల్ స్పూన్లు 
పోపు దినుసులు : టీ స్పూన్ 
కరివేపాకు : రెండు రెమ్మలు 
కొబ్బరితురుము : తెండు టీ స్పూన్లు  
నూనె : కప్పు 
బెల్లం : చిన్నముక్క 
జీలకర్ర : టీ స్పూన్ 
ఆవాలు : అర టీ స్పూన్ 
ఎండుమిర్చి : మూడు 
మినపప్పు : అర టీ స్పూన్ 
శెనగపప్పు : అర టీ స్పూన్ 
నిమ్మరసం : రెండు టేబుల్ స్పూన్లు 


తయారు చేయు విధానం :


1) ముందుగా కంద ముక్కలు ఒక గిన్నెలో వేసి పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కొన్ని నీళ్ళు పోసి ఉడికించి చిల్లులగిన్నెలో వేసి ఫైన చల్లని నీళ్ళు పొయ్యాలి. ఇలా చేస్తే కంద ముక్కలు పొడిపొడిగా వుంటాయి.
2) స్టవ్ మీద కళాయిపెట్టి నూనె వేడిచెయ్యాలి. దీనిలో తోటకూరతరుగు, ఉప్పు వేసి ఒకనిముషం మగ్గించి, తరువాత పచ్చిమిర్చి, చింత పండు రసం, కారం, బెల్లం, ఉప్పు వేసి రెండునిముషాలు మగ్గనివ్వాలి.
3) ఇప్పుడు కందముక్కలు వేసి ఒకనిముషం కలిపి పక్కనపెట్టాలి.
4) ఇప్పుడు స్టవ్ మీద నూనె వేడిచేసి  జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శెనగ పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
5) వేగాక కందమిశ్రమం వేసి అల్లం, కొబ్బరి పొడి కలిపి స్టవ్ ఆపాలి. దించాక నిమ్మరసం కలపాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కంద తోటకూర కర్రీ రెడీ.