సేమియా కట్లెట్ (Semiya Cutlet in Telugu)

కావలిసిన పదార్దాలు : 

సేమియా : మూడు కప్పులు 
నిమ్మకాయ : ఒకటి
బంగాళ దుంపలు : మూడు 
పచ్చి బఠానీ : పావు కప్పు 
బ్రెడ్ పొడి : కప్పు 
మైదా : అర కప్పు 
కొత్తిమీర : ఒకకట్ట 
పుదినా : ఒకకట్ట 
క్యారెట్ - రెండు,
కారం : రెండు స్పూన్లు 
ఉప్పు : తగినంత 
నూనె : తగినంత 

తయారు చేసేవిదానం 

1) బంగాళ దుంపలు, క్యారెట్, పచ్చిబఠానీలను మెత్తగా ఉడికించి ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి.
2) తర్వాత సేమియా వేడి నీళ్ళలో వేసి ఉడికించి వడకట్టి ఉంచాలి. 
3) ఉడికించిన సేమియా లో ఉప్పు, కారం, పుదినా, కొత్తిమీర వేసి మెత్తగా చేసి పెట్టుకోవాలి. 
4) దీనికి ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళ దుంప ముద్ద, నిమ్మరసం  కూడా చేర్చి కలపాలి. 
5) ఇప్పుడు మైదా పిండిని ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. 
6) అన్ని కలిపిన  సేమియా మిశ్రమాన్నిచేతితో  కట్లెట్ లా చేసి మైదాలో ముంచి బ్రెడ్ పొడిలో దొర్లించి పెనం మీద నూనె వేసి రెండు వైపులా కాల్చాలి. 
అంతే వేడి వేడి కట్లేట్ రెడీ.