
కావలసిన పదార్దములు
పచ్చిమిర్చి - ఇరవై
ఉల్లుపాయలు - రెండు
ఉప్పు - సరిపడా
దొండకాయముక్కలు - ఒకకప్పు
జీలకర్ర - టీ స్పూన్
వెల్లుల్లి రేకలు - పది
నూనె రెండు - టీ స్పూన్లు
పోపుగింజలు - టీ స్పూన్
కరివేపాకు - రెండు రెమ్మలు
చింతపండు - నిమ్మకాయంత
తయారుచేయు విధానం
1) నూనె వేడి చేసి పచ్చిమిర్చి వేయించాలి.అదే నూనెలో దొండకాయ ముక్కలు వేయించాలి.
2) పచ్చిమిర్చికి ఉప్పు,వెల్లుల్లి, జీలకర్ర,దొండ ముక్కలు కలిపిమెత్తగా నూరాలి.దొండ ముక్కలు నలిగిన తరువాత చింతపండు వేసి నలిగిన తరువాత ఉల్లిపాయలు వేసి కచ్చాపచ్చాగానూరాలి.ఉల్లి నలిగి నలగకుండా ఉంటె రుచిగా ఉంటుంది.
3) ఇప్పుడు నూనె వేడిచేసి పోపుదినుసులు,ఎండమిర్చి,కరివేపాకు వేసి వేగిన తరువాత నూరిన ఈ పచ్చడిని వేసి తాలింపు పెట్టాలి.అంతే మామిడి పచ్చడి రెడీ.
ఈ పచ్చళ్ళు రోట్లో నూరితేనేబాగుంటాయి.
అప్పుటి కప్పుడు చేసుకొని వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది
300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te