పనీర్ జమూన్లు (Panneer Jamoon in Telugu)

కావలసిన పదార్దాలు:


మైదా : వంద గ్రాములు
పనీర్ : వందగ్రాములు
నెయ్యి : పావుకిలో
షుగర్ : పావుకిలో
యాలకుల పొడి : ఒక టీ స్పూన్

తయారుచేయు విధానం :

1) ఒక గిన్నెలో మైదా, పనీర్ వేసి కొద్దిగా నీళ్ళువేసి ముద్దలా కలపాలి.
2) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నెయ్యి వేడి చెయ్యాలి.
3)  ప్రక్క స్టవ్ ఫై ఒక గిన్నె పెట్టి దానిలో పంచదార, కొద్దిగా నీళ్ళు వేసి తీగ పాకం పట్టాలి.
4) ఇప్పుడు కలిపిన పనీర్ మిశ్రమం చిన్నచిన్న ఉండలుగా చేసి కాగిన నేతిలో వేసి చిన్న మంట మీద దోరగా వేయించి పంచదార పాకంలో వెయ్యాలి.
5) పది నిముషాలకు పాకం పీల్చుకొని జామున్లు  తినటానికి రెడీ.