కావలసినపదార్దాలు:
బియ్యం : అర కేజీ
జీడిపప్పు : సరిపడ
జీలకర్రపొడి : స్పూన్
దాల్చిన చెక్క: కొద్దిగా
ఇంగువ : చిటికెడు
ఆవాలు : స్పూన్
నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు
దొండకాయలు : పావుకేజీ
పచ్చిమిర్చి: ఆరు
ధనియాల పొడి : స్పూన్
నువ్వులు : స్పూన్
ఎండుకొబ్బరి పొడి : రెండు స్పూన్లు
లవంగాలు : కొన్ని
ఉప్పు : సరిపడ
తయారు చేసే విధానం:
1) స్టవ్ ఫై గిన్నె పెట్టి నెయ్యి వేడిచేయాలి.
2) దీనిలో ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు పెట్టాలి.
3) ఇప్పుడు దొండకాయల ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు వేయించాలి.
4) దీనిలోనే బియ్యం వేసి కొద్దిగా ఫ్రై చేసి నీళ్లుపోసి కలిపి ఉడికించాలి.
5) అన్నం సగం ఉడి కాక మసాలా పొడి, ఎండుకొబ్బరి, ఉప్పు, నువ్వుల 6) పొడి వేసి కలిపి చిన్న మంట మీద ఉడికిస్తే మసాలా బాత్ రైస్ రెడీ.
7) స్టౌఆపి దీని పైన కొత్తిమీర, వేయించిన జీడిపప్పు తో అలంకరించి సర్వ్ చేయాలి.
మసాలా బాత్ రెడీ.

Post a Comment