కావలసిన పదార్దాలు : బియ్యప్పిండి : కప్పు
ఉప్పు : తగినంత
కారం : అర టీ స్పూన్
వాము : టీ స్పూన్
నువ్వులు : టీ స్పూన్
నూనె : వేయించటానికి సరిపడా
తయారుచేయు విధానం :
1) బియ్యం రెండు గంటలు నీటిలో నానబెట్టి నీళ్ళు వంచి మెత్తని పిండిలా మిక్సి పట్టాలి.
2) బియ్యప్పిండిలో కారం, ఉప్పు, వాము, నువ్వులు వేసి కలిపి నీళ్ళు పోసి జిగురుగా కలపాలి.
3) దీనిని చేతితో ఒక క్లాత్ మీద సకినాలుగా గుండ్రంగా వెయ్యాలి.వీటిని కాసేపు ఆరనివ్వాలి.
4) ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.
5) నూనె కాగిన తరువాత ఆరిన సకినాలు వేసి రెండు ప్రక్కలా దోరగా వేయించి తీసుకోవాలి.
అంతే కరకరలాడే సకినాలు రెడీ.