మెంతిఆకు పప్పుపొడి కూర కావలసినపదార్దాలు:
మెంతు కూర : రెండు కట్టలు
పెసర(కంది) పప్పు: పావుకప్పు
పోపుదినుసులు : టీ స్పూన్
ఎండుమిర్చి : పది
వెల్లుల్లి రెబ్బలు :పది
కారం : పావు టీ స్పూన్
ఉప్పు తగినంత
నూనె : అర కప్పు
పసుపు :పావు టీ స్పూన్
కరివేపాకు :రెండురేమ్మలు
కొత్తిమీర :కొద్దిగా
పచ్చిమిర్చి : నాలుగు
తయారుచేయువిధానం:
1)మెంతు కాడలు తీసేసి ఆకులు శుబ్రంగా కడిగి పక్కన పెట్టాలి.
2) స్టవ్ ఫై కళాయి పెట్టి వేడిచేసి పెసరపప్పు వేసి వేయించాలి.
3) దీనిలోనే కొద్దిగా నూనె వేసి ఎండు మిర్చి వేసి వేయించి తియ్యాలి.
4) ఇప్పుడు మిక్సి జార్లో వేయించిన పెసర పప్పు,ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి పొడిలా మిక్సి పట్టాలి.
5) స్టవ్ మీద నూనె వేడి చేసి పోపు దినుసులు, ఎండిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర పచ్చిమిర్చి వేసి వేగాక మెంతుకూర వేసి ఐదు నిముషాలు మగ్గ నివ్వాలి.
6) ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు వేసి ఒక సారి కలిపి ముందుగా చేసి
పెట్టుకున్న పెసర పొడి వేసి బాగా కలపాలి.చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆపాలి.