
కావలసిన పదార్దాలు :
పోట్లకాయ : చిన్నది (చిన్న ముక్కలుగా చేసి ఉడికించాలి.)
పాలు : అర లీటరు
బియ్యం : రెండు స్పూన్లు నానబెట్టాలి
కొబ్బరి తురుము : రెండు టేబుల్ స్పూన్లు
పంచదార : రెండు వందల గ్రాములు
యాలకులపొడి : అర టీ స్పూన్
జీడిపప్పులు, కిస్మిస్లు : పావు కప్పు
తయారుచేయు విధానం :
1) స్టవ్ మీద గిన్నె పెట్టి పాలు మరిగించాలి.
2) మిక్సి జార్లో నాన బెట్టిన బియ్యం, కొబ్బరి కలిపి మెత్తగా గ్రైడ్ చెయ్యాలి.
2) మిక్సి జార్లో నాన బెట్టిన బియ్యం, కొబ్బరి కలిపి మెత్తగా గ్రైడ్ చెయ్యాలి.
3) మరుగుతున్న పాలల్లో పంచదార, మెత్తగా చేసిన బియ్యం మిశ్రమం,ఉడికించిన పోట్లకాయ ముక్కలు వేసి చిన్న మంట మీద ఉడికించాలి.
4) పదినిముషాలు ఉడికిన తరువాత నేతిలో వేయించిన జీడిపప్పులు, కిస్ మిస్ లు, యాలకుల పొడి వేసి కలపాలి.
4) పదినిముషాలు ఉడికిన తరువాత నేతిలో వేయించిన జీడిపప్పులు, కిస్ మిస్ లు, యాలకుల పొడి వేసి కలపాలి.
అంతే ఎంతో రుచిగా ఉండే వేడి వేడి పోట్లకాయ పాయసం రెడీ.