వేరుసెనగ పొడి (Ground Nut Podi in Telugu )


 వేరుసెనగ గుళ్ళు పొడి (ground nuts  Podi in Telugu)

కావలసిన పదార్దాలు: 
 
వేరుసెనగ గుళ్ళు  : ఒక కప్పు 
ఎండు మిర్చి : ఆరు 
జీలకర్ర : టీ స్పూన్ 
వెల్లుల్లి రెబ్బలు : ఐదు 
ఉప్పు : సరిపడ
నూనె : ఒక స్పూన్ 
కరివేపాకు _
తయారుచేయు విధానం: 

1) స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి చెయ్యాలి. దీనిలో స్పూన్ నూనెవేసి. కాగాక 
ఎండి మిర్చి, జీలకర్ర, కరివేపాకు  వేసి వేయించాలి.వీటిని మిక్సి జార్లో వేసి గ్రైండ్ చెయ్యాలి. 

2)  ఇప్పుడు అదే పాన్లో వేరుసెనగ  పప్పువేసి దోరగా వేయించాలి. వేయించిన వేరుసెనగ పప్పు గ్రైండ్  చేసిన ఎండిమిర్చిలో వేసి మళ్ళి గ్రైండ్  చెయ్యాలి.

3) ఇప్పుడు ఉప్పు, వెల్లుల్లి వేసి మరొకసారి గ్రైండ్  చేస్తే చాలు ఎంతో రుచిగా ఉండే వేరుసెనగ పొడి రెడీ.

ఇది ఇడ్లి, ఉప్మా,దోశెల్లోకి ఎంతో బాగుంటుంది.