కావలసిన పదార్దాలు:
పనస పిక్కలు : పదిహేను
శెనగపిండి : పావుకేజీ
కారం : కొద్దిగా
ఉప్పు : తగినంత
వాము : కొద్దిగా
వంటసోడా : చిటికెడు
నూనె : పావుకేజీ
తయారుచేయు విధానం :
1) పనస పిక్కలు వుడికించి ఫై పొర వలిచి పక్కనపెట్టాలి.
2) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.
3) నూనె కాగే లోపు ఒక గిన్నెలో శెనగ పిండి, ఉప్పు, కారం, వాము, వంటసోడా వేసి కలిపి నీళ్ళు పోసి కాస్త చిక్కగా బజ్జిల పిండిలా కలపాలి.
4) ఉడికించిన పనస పిక్కల్ని ఒకొక్కటిగా ఈ పిండిలో ముంచి కాగే నూనెలో బజ్జిలా వెయ్యాలి.
5) దోరగా వేగాక ఒక ప్లేటులోకి తీసుకోని కొబ్బరి చెట్నితో తింటే చాల బాగుంటాయి.
