పల్లీలు : పావుకేజీ
ఉల్లిపాయలు : నాలుగు
పచ్చిమిర్చి : మూడు
జీలకర్ర : అర టీ స్పూన్
ఉప్పు : తగినంత
కారం : అర టీ స్పూన్
కొత్తిమీర : కొద్దిగా
కరి వేపాకు : కొద్దిగా
కార్న్ ఫ్లోర్ : పావు కప్పు
శెనగపిండి : కప్పు
నూనె : వేయించటానికి సరిపడా
తయారుచేయు విధానం :
1) పల్లీలు వేయించి పొట్టు తీసుకోవాలి. ఉల్లి, మిర్చి కట్ చెయ్యాలి.
2) ఒక గిన్నెలో వేయించిన పల్లీలు, ఉల్లి, మిర్చి ముక్కలు, కారం, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, కార్న్ ఫ్లోర్, శెనగపిండి వేసి కొద్దిగా నీళ్ళు పోసి పకోడి పిండిలా కలపాలి.
3) స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడిచెయ్యాలి. నూనెకాగిన తరువాత పకోడిల్లా వేసి దోరగా వేయించి ఒక ప్లేటులోకి తీసుకోవాలి.