
కావలసిన పదార్దాలు :
మటన్ బోన్స్ – అర కేజీ
అల్లం వెల్లుల్లి పేస్టూ – రెండు టీ స్పూన్లు
ఉల్లి పాయలు – మూడు
కొబ్బరి తురుము – కప్పు
కారం – ఒక టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
గసాలు – రెండు టేబుల్ స్పూన్లు
చెక్క – చిన్న ముక్క
లవంగాలు – మూడు
టొమాటోలు – ఐదు
పచ్చిమిర్చి - ఆరు
పుదినా – కట్ట
కొత్తిమీర – కట్ట
నూనె – అర కప్పు
మసాల పొడి – టీ స్పూన్
పసుపు అర టీ స్పూన్
తయారుచేయు విధానం:
1) టమాటాలు కడిగి గ్రైండ్ చెయ్యాలి.గసాలు మెత్తగా నూరాలి.
2) ఉల్లి,మిర్చి ముక్కలుగా కట చెయ్యాలి.మటన్ బోన్స్ కడిగాలి.
3) స్టవ్ ఫై నూనె వేడి చేసి ఉల్లి, మిర్చి ముక్కలు వేసి వేయించాలి.
4) ఇప్పుడు మటన్ బోన్స్ , కారం, ఉప్పు, పసుపు, వేసి కాసేపు ఉడికించాలి.
5) ఇప్పుడు కొబ్బరి, గసాలుముద్ద అల్లం వెల్లుల్లి ముద్దా వేసి కలిపి టమాటా గుజ్జువేసి కలిపి సరిపడ నీళ్ళుపోసి పదిహేను నిముషాలు ఉడికించి స్టవ్ ఆపాలి.
6) ఇప్పుడు మసాలా, కొత్తిమీర, పుదినా వేసి మూతపెట్టి ఐదు నిముషాలు తరువాత సర్వ్ చెయ్యాలి.
Post a Comment