కావలసిన పదార్థాలుఐస్క్రీమ్ పౌడర్ -ఒకపాకెట్పాలు - ఒక కప్పు
నీళ్లు - నాలుగు కప్పులు
పంచదార - ఒక కప్పు
జీడిపప్పు - పావుకప్పు
యాలకులు - పది
అరటిపండు - ఒకటి
యాపిల్ - ఒకటి
జామపండు - ఒకటి
పైనాపిల్ - సగం
తయారుచేసే పద్ధతి
1) ఐస్క్రీమ్ పౌడర్ను పాలలో కలిపి పేస్టులా తయారు చేయాలి.
2) నీళ్లను బాగా మరగబెట్టాలి.
3) ఐస్క్రీమ్ పౌడర్ కలిపిన పాలను అందులో వేసి బాగా కలుపుతూ ఉండాలి.
4) చిక్కగా అయిన తర్వాత పంచదార, యాలకుల పొడి, ముక్కలు చేసిన జీడిపప్పు వేసి చిక్కగా వుడకనివ్వాలి.
5) ఇప్పుడు దించి చల్లార్చి డీప్ఫ్రిజ్లో పెట్టాలి.
6) కొంచెం గట్టిగా అయిన తర్వాత మజ్జిగ కవ్వంతోగానీ ఎగ్ బీటర్తో కానీ చిలికితే ముద్ద అవుతుంది.
7) ఇప్పుడు అన్ని రకాల పండ్ల ముక్కలు సన్నగా తరిగి ఐస్క్రీమ్ పైన వేసి సర్వ్ చేయాలి.
Post a Comment