కావలసిన పదార్దాలు :పాలు : లీటరు
ఖర్జూరాలు : పది
పంచదార : కప్పు
జీడిపప్పు : కొద్దిగా
బాదం పప్పు : కొద్దిగ
వాల్నట్స్ : కొద్దిగ
యాలకుల పొడి : కొద్దిగ
తయారుచేయు విధానం :
1) ఖర్జూరాలలో గింజలు తీసేసి పావు కప్పు పాలలో ఖర్జూరాలు, జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్ ని రెండు గంటలసేపు నానబెట్టాలి.
2) అవి బాగా నానిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
3) మిగిలిన పాలను స్టవ్ మీద పెట్టి చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి.
4) ఇప్పుడు అందులో పంచదార వేసి బాగా కలపాలి.
5) తరువాత ఇందులో గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కలిపి అడుగు అంటకుండా బాగా కలిపి యాలకుల పొడి వేసి దించేయాలి.
6) చల్లారిన తరువాత కాసేపు ఫ్రిజ్లో ఉంచి సర్వ్ చేయాలి.
Post a Comment