
కావలసిన పదార్దాలు :
బియ్యం : అర కిలో
కారెట్ : నాలుగు (ముక్కలుగా కట్ చెయ్యాలి )
బీన్సు: వంద గ్రాములు ( ముక్కలుగా కట్ చెయ్యాలి )
బంగాళా దుంపలు : నాలుగు ( చిన్న ముక్కలుగాకట్ చెయ్యాలి )
ఉల్లిపాయలు : అయిదు ( నిలువుగా ముక్కలు చేసుకోవాలి)
పచ్చి బఠాణీ : ఒక కప్పు ( నాన బెట్టినవి )
లవంగాలు: అయిదు
యాలకులు : ఆరు
దాల్చిన చెక్క : ఆరు ముక్కలు
అల్లం వెల్లుల్లి ముద్ద : రెండు టీ స్పూన్లు
నేయ్యి లేదా డాల్డా : తగినంత
పచ్చిమిర్చి: ఆరు(నిలువుగా చీలికలు చేసుకోవాలి)
ధనియాలు, జీలకర్ర పొడి: రెండు స్పూన్లు
కారం: ఒక స్పూను
పసుపు: చిటికెడు
ఉప్పు : తగినంత
నీరు: ఒకలీటరు
కొత్తిమీర: ఒక కట్ట
పుదినా : అర కట్ట
జీడిపప్పు: పది పదిహేను
బిర్యాని ఆకు : రెండు మూడు
తయారుచేయు విధానం :
1) ముందుగా బియ్యం కడిగి నీటిలో ఒక అరగంట నాన నివ్వాలి. కూరలన్నీ తరిగి పెట్టుకోవాలి.
2) ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టాలి. అందులో సుమారు రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి.
3) నూనె కాగాక అందులో లవంగాలు, యాలకులు , జీడి పప్పు, బిర్యాని ఆకు మరియు చెక్క వేసి వేయించాలి.
4) ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేపి .ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వెయ్యాలి. అది పచ్చి వాసన పోయే దాక వేయించి పచ్చి మిర్చి వేసుకోవాలి.
5) వేగాక అందులో తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి.అవి కొంచెం వేగ నివ్వాలి.
6) ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వెయ్యాలి. అన్ని బాగా కలిపి కొత్తిమీర, పుదినా, ఉప్పు, పసుపు, కారం మరియు ధనియాలు జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి.
7) ఇప్పుడు ఒక లీటరు నీరు పోసి అన్నీ బాగా కలిపి మూత పెట్టుకోవాలి.కుక్కర్ రెండు విజిల్స్ రాగానే కట్టేయ్యాలి.
అంతే ఎంతో రుచిగా ఉండే వెజిటబుల్ బిర్యాని రెడీ
Post a Comment