
కావలసిన పదార్దాలు :
కంద : పావుకిలో
బచ్చలి కూర తరుగు : మూడు కప్పులు
ఉప్పు: తగినంత
పసుపు : అర టీ స్పూన్
కారం : టీ స్పూన్
చింతపండు రసం : రెండు టేబుల్ స్పూన్లు
పోపుదినుసులు : టీ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
కొబ్బరి తురుము : తెండు టీ స్పూన్లు
నూనె : కప్పు
బెల్లం : చిన్న ముక్క
జీలకర్ర : టీ స్పూన్
ఆవాలు : అర టీ స్పూన్
ఎండు మిర్చి : మూడు
మినపప్పు : అర టీ స్పూన్
శెనగ పప్పు : అర టీ స్పూన్
నిమ్మరసం : రెండు టేబుల్ స్పూన్లు
తయారు చేయు విధానం:
1) ముందుగా కంద ముక్కలు ఒక గిన్నెలో వేసి పసుపు,కొద్దిగా ఉప్పు వేసి కొన్ని నీళ్ళు పోసి ఉడికించి చిల్లుల గిన్నెలో వేసి ఫైన చల్లని నీళ్ళు పొయ్యాలి. ఇలా చేస్తే కంద ముక్కలు పొడిపొడిగా వుంటాయి.
2) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.దీనిలో బచ్చలి కూర తరుగు,ఉప్పు వేసి ఒకనిముషం మగ్గించి
తరువాత పచ్చిమిర్చి,చింత పండు రసం, కారం,బెల్లం ముక్క వేసి రెండు నిముషాలు మగ్గనివ్వాలి.
3) ఇప్పుడు కంద ముక్కలు వేసి ఒక నిముషం కలిపి పక్కనపెట్టాలి.
4) ఇప్పుడు స్టవ్ మీద నూనె వేడి చేసి జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శెనగ పప్పు, ఎండు మిర్చి కరివేపాకువేసి వేయించా లి.
5) వేగాక కంద మిశ్రమం వేసి అల్లం, కొబ్బరి పొడి కలిపి స్టవ్ ఆపాలి.దించక నిమ్మరసం కలపాలి.
అంతే ఎంతో రుచిగా ఉండే కంద బచ్చలి కర్రీ రెడీ.